![]() |
![]() |
.webp)
ఒకప్పుడు మనమంతా పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళం...పంటలు పండించుకుని ఎలాంటి పురుగుమందులు వాడకుండా ఆర్గానిక్ ఫుడ్ ని తినేవాళ్ళం..అందుకే మన తాతలు, బామ్మలు 90 ఏళ్ళు వచ్చినా కూడా నడుములు ఒంగకుండా, కళ్ళజోడులు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒక్క మందుబిళ్ల కూడా వేసుకోకుండా ఏళ్లకేళ్లు బతికారు. కానీ తర్వాత తరం మారింది. గడిచిన ఈ ఇరవై ఇళ్లల్లో పంటలు, పొలాలు, రైతులు, ప్రజలు, తిండి, తిప్పలు, విధానాలు, రోగాలు ఇలా అన్నిట్లో భయంకరమైన మార్పులు వచ్చాయి.. ఆర్గానిక్ ఫుడ్ కాస్తా పోయి విషం తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పుట్టిన వాళ్లకు చూపు లేకుండా, క్యాన్సర్స్ తో, రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో బతుకుతున్నారు చాలా మంది. ఇలాగే ఇంకొన్నేళ్లు ఉంటే మనుషుల మీద కొత్త కొత్త రోగాలు దాడి చేసి మరణాల రేట్ పెరిగిపోయే అవకాశం చాలా కనిపిస్తోంది.
అలాంటి ఎంతోమందికి ఆర్గానిక్ ఫుడ్ గురించి అవగాహన కల్పించేందుకు చాలామంది ఈ మధ్యకాలంలో ముందుకొస్తున్నారు. ఇప్పుడు యాంకర్ ఉదయభాను కూడా తన పొలంలో ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే పంటలకు పెస్టిసైడ్స్ కాకుండా గో-ఆధారిత జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తన యూట్యూబ్ వీడియోస్ లో చూపిస్తోంది. జీవామృతంలో ఆర్గానిక్ బెల్లం మాత్రమే వేయాలని ఒకవేళ అది దొరకని పక్షంలో మాగిపోయిన పళ్ళను ఐనా ఉపయోగించవచ్చని చెప్పింది. అలా జీవామృతాన్ని తయారు చేసి చూపించింది. ఇక ఈ ఇన్స్పిరేషనల్ వీడియో చూసి నెటిజన్స్ కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. "హాయ్ భానుగారు నేను కూడా రైతు బిడ్డనే కానీ పొలం పనులు ఎప్పుడు చేయాలేదు మీ వీడియో చూసాక నేను ఏం తప్పు చేశానో తెలిసింది..జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తోంది..." అంటున్నారు. ఇదే కదా మనందరి ఆరోగ్యం, భావితరాల భవిష్యత్తు అంటూ ఉదయభాను చెప్పిన ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు.
![]() |
![]() |